దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకుల్లో కొత్త మార్పులు చేర్పులు ఏప్రిల్ నెల నుంచి ప్రారంభమయ్యాయి ప్రతి ఒక్క బ్యాంక్ అకౌంట్ కలిగిన ఖాతాదారులు ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే లేదంటే నష్టపోయే అవకాశాలే ఎక్కువ అవేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
1. ఫిక్స్ డిపాజిట్ల వడ్డీ రేట్లు మార్పు
ఎస్బిఐ హెచ్డిఎఫ్సి ఇలా పలు రకాల బ్యాంకుల్లో ఫిక్స్ డిపాజిట్ (FD)లపై వడ్డీరేట్లు ఆయా బ్యాంకులు తగ్గించాయి ప్రస్తుతం ఆ బ్యాంకుల్లో ఉన్న వడ్డీ రేట్లు రెండు సంవత్సరాల వ్యవధిగాను 7.25% లేదా 7% శాతానికి తగ్గించడం జరిగింది. గతంలో ఈ వడ్డీ రేట్లు కొంచెం అధికంగా ఉండేవి ఈ ఆర్థిక సంవత్సరం 2025 26 గాను మార్పులు చేస్తూ ఆర్బిఐ ఈ రేట్లు సవరించింది.
📌ఇది చూడండి: ఏపీ ఇంటర్ ఫలితాలు డేట్ ఫిక్స్
2.ATM చార్జీలు పెంపు
2025 26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏటీఎం కార్డుల ద్వారా మీరు డబ్బును తీస్తూ ఉంటే ఈ కొత్త రకం చార్జీలు మీ మీద పడబోతున్నాయి. గతంలో మరియు ఇప్పుడు ATM లావాదేవీల ఉచిత పరిమితిని యధావిధిగా ఉంచింది ఆర్బిఐ అకౌంట్ ఉన్న బ్యాంకు కి ఏటీఎం కార్డు కలిగి ఉన్న వారి ఆయా సొంత బ్యాంకు ఏటీఎం మెషిన్లలో మీరు 5 లావాదేవీలు ఉచితంగా చేసుకోవచ్చు ఇతర బ్యాంకు ఏటీఎంలో కేవలం 3 ఉచిత లావాదేవీలు మాత్రమే చేసుకోవచ్చు. ఈ ఉచిత లావాదేవీల పరిమితి దాటిన తర్వాత మీరు చేసే ప్రతి ట్రాన్సాక్షన్ పై 23 రూపాయల అదనపు చార్జీలు విధించడం జరుగుతుంది గతంలో ఇది 21 రూపాయి గా ఉండేది.
3.UPI నెంబర్ తొలగింపు
యూపీఐ పేమెంట్స్ దాదాపు అందరూ చేస్తూ ఉంటారు కానీ ఆర్బిఐ ఎప్పుడు తీసుకొచ్చిన నియమ నిబంధన ప్రకారం గడిచిన 12 నెలల్లో మీరు ఉపయోగించే ఫోన్ నెంబర్ నిలిచిపోయిన ఎడల దానికి లింక్ అయి ఉన్న యూపీఐ పేమెంట్స్ యాప్ ను ఆ నంబర్ నుంచి డి ఆక్టివేట్ చేయడం జరుగుతుంది తద్వారా మోసాలకు అరికట్టడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బిఐ చెబుతోంది ఒకవేళ మీరు మీ యూపీఐ నెంబర్ను పొనరోదించాలని కుంటే దగ్గర్లో ఉండే బ్యాంకుకు వెళ్లి మీ యూపీఐ నెంబర్ ను మార్చుకోవాల్సిందిగా కోరడం జరిగింది.
4. మినిమం బాలన్స్ – జరిమానా
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మినిమం బాలన్స్ తప్పనిసరి చేస్తూ కొన్ని బ్యాంకులు నిర్ణయాలు తీసుకున్నాయి తప్పనిసరిగా బ్యాంకుల్లో ఈ నిబంధనను అమలు చేయాలని ఒకవేళ మినిమం బాలన్స్ లేకపోతే ఆయా అకౌంట్లో నుంచి జరిమానాలను కూడా విధించబోతున్నారు ప్రస్తుతం ప్రభుత్వ రంగ సంస్థల్లో సేవింగ్స్ ఖాతాల్లో ఎటువంటి మినుము బ్యాలెన్స్ లేకుండానే మీరు ఎకౌంట్ ని ఉపయోగించుకోవచ్చు కానీ ప్రైవేట్ రంగ సంస్థలో ఉండే బ్యాంకుల్లో మాత్రం తప్పనిసరిగా మినిమం బాలన్స్ మైంటైన్ చేయాల్సి ఉంటుంది.
